మిలిటరీ అకాడమీలో 631 మందికి శిక్షణ పూర్తి

డెహ్రడూన్‌: ఉత్తరఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూస్‌లోని సుప్రసిద్ధ ఇండియన్‌ మిలిటరీ అకాడమీ నుంచి 631 మంది కేడెట్‌లు తాజాగా శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారిలో 74 మంది భారత్‌తో స్నేహసంబంధాలున్న పొరుగు దేశాల వారు కూడా ఉన్నారు. శిక్షణ పూర్తయిన వారంతా తమతమ దేశాల్లోని సైన్యంలో అధికారులు చేరతారు. ఈ సందర్భంగా కన్నులపండువగా పరేడ్‌ నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన ఈ మిలిటరీ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న కేడెడ్‌లకు ఎయిర్‌ఛీఫ్‌ మార్షల్‌ ఎస్‌.ఎ.కెబ్రానే శుభాభినందనలు తెలిపారు. మనదేశం నుంచి శిక్షణ పూరిచేసుకున్నవారిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 112 మంది, హర్యానా నుంచి 60 మంది, ఉత్తరఖండ్‌ నుంచి 52 మంది ఉన్నారు.