మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి

శ్రీనగర్: జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన మిలిటెంట్ల దాడిలో పోలీసు మృతి చెందారు. పూర్తి వివరాలు: కశ్మీర్లోని రెడ్వాని ప్రాంతంలో హోంషాలిబాఘ్  ఎమ్మెల్యే జహూర్ అహ్మద్ దార్ ఇంటికి సమీపంలో శనివారం ఉదయం మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే దార్ తీవ్రంగా గాయపడగా.. జహూర్ అహ్మద్ ఇలాహి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత పనిమీద ఇలాహితో కలిసి మోటార్ సైకిల్పై వెళ్తుండగా మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మెల్యేను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.