ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీఆర్ఏల గోస పట్టదా!

యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి
తగుళ్ల అంజి యాదవ్ .

 

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 10., ( జనం సాక్షి న్యూస్) : స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ఆవరణలో గత పదిహేడు రోజులు గా నిరవధిక సమ్మెను చేపట్టిన వీఆర్ఏల కు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తగుళ్ల అంజి యాదవ్ సందర్శించి సంఘీభావం ప్రకటించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీఆర్ఏలు గత 17 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ నిరవధిక సమ్మెను చేపట్టారని అయినా ఈ ప్రభుత్వ పాలకులకు నిమ్మకు నీరేత్తిన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు . ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా లక్షలకు లక్షలు జీతాలు వీఆర్ఏలు ఏమి అడగటం లేదని వారికి కేవలం చట్టపరంగా ఇవ్వాల్సిన ప్రతి ఫలాలను ప్రభుత్వం ఎందుకు అందజేస్తలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఏమోగానీ ఉన్న ఉద్యోగాల కు శని దాపురించిందని తీవ్రంగా ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణ ధనిక రాష్ట్రం అంటూ ఊదరగొట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల కనీస డిమాండ్లు ఎందుకు పరిష్కరించడం లేదని అన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల రాబోతున్న వేళ ప్రభుత్వాలు వజ్రోత్సవాలు అని నిర్వహిస్తుంటే మరోపక్క ఈ భారతావనిలో ఈ వజ్రా ఉత్సవాల వేల వీఆర్ఏలు తమ జీవితాల బాగుకై రెవెన్యూ కార్యాలయాల ముందు ఇలా టెంట్లు వేసుకుని నిరసన సమ్మెను చేపట్టడం ముమ్మాటికి ప్రభుత్వ అసమర్థత పాలననే కారణం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ నాయకులు మహేష్ బాల్ లింగం సాజిద్ శాంతమ్మ మరియు వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు