ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ రాజీనామా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్‌ రాజీనామా సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ డీవై పాటిల్‌నుకలిసి ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. సభలో బల నిరూపణకు అవకాశమివ్వాలని గవర్నర్‌ డీవై పాటిల్‌ను కోరారు. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అదివారం ఉదయం మంత్రివర్గ అత్యవసర సమావేశం అనంతరం ఆయన జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించారు. భాజపా ఎన్నికల సారధ్య బాధ్యతలు నరేంద్రమోడీకి అప్పగించడాన్ని వ్యతిరేకించిన జేడీయూ భాజపాతో 17 -ఏళ్ల అనుబంధానికి స్వస్తి చెప్పింది.