ముగిసిన బీహార్‌ మంత్రి వర్గ సమావేశం

పాట్నా: బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎన్టీఏతో జేడీయూ తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో భాజపాకు చెందిన మంత్రులు మ్తంరివర్గ సమావేశానికి గైర్హాజ రుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం నితీష్‌కుమార్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారు. బీహార్‌కు చెందిన భాజపా నేతలు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకోనున్నారు.