ముజఫర్‌పూర్‌ తీర్పు జనవరికి వాయిదా

న్యూఢిల్లీ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): బీహార్‌ ముజఫర్‌పూర్‌లో షెల్టర్‌ ¬ం కేసులో తీర్పును వచ్చే ఏడాది జనవరి 14వ తేదీకి వాయిదా వేశారు. వాస్తవానికి ఈ కేసులో తీర్పును నేడు వెలువరించాల్సి ఉంది. అయితే సంబంధిత న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో తీర్పును వాయిదా వేశారు. ముజఫర్‌పూర్‌లోని షెల్టర్‌ ¬ంలో అనేకమంది బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసి, భౌతికంగా హింసించారు. ఈ కేసులో బీహార్‌ పీపుల్స్‌ పార్టీ ఎమ్మెల్యే బ్రజేష్‌ ఠాకూర్‌ ప్రధాన నిందితుడు.