ముడిచమురు ధరు తగ్గినా.. పెట్రో ధరు పెంచిన కేంద్రం

` ధరతో కేంద్రం ప్రజపై దాడి` పెట్రోల్‌పై లీటరుకు రూ.10, డీజిల్‌పై రూ.13 పెంపు

` అదనపు సుంకా పేరుతో భారం మోపిన కేంద్రం`

అంతర్జాతీయంగా ధరు తగ్గినా తట్టుకోలేక పోయిన బిజెపి సర్కార్‌

న్యూఢల్లీి,మే 6(జనంసాక్షి):కరోనా కష్టాల్లోనూ కేంద్రం ఆదాయంపై దృష్టి సారించింది. ప్రజపై దర దాడి మొదు పెట్టింది. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. అంతర్జాతీయంగా ధరు తగ్గితే వాటి ఫలాు ప్రజకు అందకుండా చేసింది. భారీగా ధరు పెంచి పెట్రోల్‌ ఖరీదైన ఆయిల్‌ అన్న నిజాన్ని నిజం చేసింది.  కరోనాతో ఏర్పడిన లాక్‌డౌన్‌ వ్ల వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరు తగ్గాయి. కానీ కేంద్రం ఈ సమయంలో ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచేందుకు నిర్ణయించింది.  పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 ఎక్సైజ్‌ డ్యూటీని పెంచారు. దీంతో పెట్రోలియం ఉత్పత్తు ధరు లీటరుపై సుమారు రూ.10 నుంచి రూ.15 మధ్య పెరిగే అవకాశం ఉన్నది.  దీనితో పాటు రోడ్డు సెష్‌ రూపంలో అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని కూడా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరకు 8 రూపాయు పెంచనున్నారు. పెట్రోల్‌పై స్పెషల్‌ అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని రెండు రూపాయు పెంచారు. డీజిల్‌పై రూ.5 పెంచారు. దీని వ్ల కేంద్ర ఖజానా భారీగా నిండనున్నది. పెరిగిన ఎక్సైజ్‌ సుంకం ద్వారా సుమారు క్షా 75వే కోట్లు వచ్చేఅవకాశాు ఉన్నాయి.  రిటేల్‌ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పులేదు. మొత్తంగా కేంద్రం పెట్రోు, డీజిల్‌ రేట్లను భారీగా పెంచేసింది. పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని, రోడ్డు, మౌలిక సదుపాయా సెస్‌ను పెంచుతూ మంగళవారం రాత్రి పొద్దుపోయాక ఉత్తర్వు జారీ చేసింది. పెంచిన కొత్త రేట్లు బుధవారం ఉదయం 6 గంటనుంచి అములోకి వచ్చాయి. గత మార్చి 21న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటినుంచి పెట్రోల్‌ ధర లీటరుకు రూ.69.59గా కొనసాగుతుండగా, డీజిల్‌ ధరకూడా రూ.62.29గానే ఉంది. కరోనా అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధు సవిూకరణకు ప్రభుత్వం మార్గాను అన్వేషించే క్రమంలో ఈ చర్య తీసుకొంది.  ఆర్థిక బ్లిులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సవరణు తీసుకు వచ్చిన రెండు నెల తర్వాత ప్రభుత్వం ఈ సుంకాను పెంచడం గమనార్హం. ªుల్లీలో పెట్రో ధరు పెరిగాయి. దీనికి కారణం ఢల్లీి ప్రభుత్వం వ్యాూ యాడెడ్‌ టాక్స్‌(వ్యాట్‌)ను పెంచింది. దీని వ్ల లీటరు పెట్రోుపై ధర రూ.1.67, డీజిల్‌పై రూ.7.10 పెరిగింది. దీంతో ఇక్కడ లీటరు పెట్రోు ధర రూ.71.26కు చేరగా, ఇంతకుముందు ఈ ధర రూ.69.59గా ఉంది. డీజిల్‌ ధర లీటరు రూ.69.39కి పెరగనుంది. ఈ డీజిల్‌ ధర ఇంతకుముందు రూ.62.29 మాత్రమే. ఢల్లీి ప్రభుత్వం వ్యాట్‌ ను పెంచడం వ్ల వార్షికంగా రూ.900 కోట్ల మేరకు ఆదాయం రానుంది.