ముదిరాజ్,బెస్త, మత్సకారుల ఆర్థిక అభివృద్ధే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..

–ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్…
ఎల్కతుర్తి 15 సెప్టెంబర్ జనం సాక్షి
ఎల్కతుర్తి మండలం గోపాల్ పూర్ గ్రామ చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ విడుదల చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…
మత్సకారుల, ముదిరాజ్, బెస్త ల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది.
ప్రతి సంవత్సరం చేపపిల్లలను ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. అన్నారు
వారికి కావాల్సిన వాహనాలను,వలలను ఇవ్వడం ,వారికి ఉపాధి కల్పించడం, తద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం జరుగుతుంది.