మునుగోడు లో మోత్కూరు టీఆర్ఎస్ నాయకుల ప్రచారం

మోత్కూరు అక్టోబర్ 12 జనంసాక్షి : మునుగోడు నియోజకవర్గం లోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డి గూడెం గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మోత్కూరు టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి మాట్లాడుతూ…టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతతో దేశంలోనే రాష్ట్రం అభివృద్ది లో నంబర్ వన్ గా నిలిచిందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మోత్కూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు పొన్నేబోయిన రమేష్, సర్పంచ్ రాంపాకా నాగయ్య, నాయకులు దాసరి తిరుమలేశు, రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.