ముఫ్తీ వ్యాఖ్యలు మిలిటరీకి అవమానం:సంజయ్‌ రావత్‌

న్యూఢిల్లీ, మార్చి 2 : జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ వ్యాఖ్యలను శివసేన ఖండించింది. పీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ దేశ ప్రజలను అవమానించిందని శివనేన నేత సంజయ్‌ రావత్‌ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌ సీఎం లేదా ఏ ముఖ్యమంత్రి అయినా అలాంటి వ్యాఖ్యలు చేస్తే అది మిలిటరీకి అవమానమని అన్నారు. భారత ప్రభుత్వానికి… సైన్యం సేవలపై నమ్మకం ఉందని, పాక్‌ సైన్యంతో వాళ్లు పోరాడుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు వాళ్లను అవమానించినట్లేనని సంజయ్‌ రావత్‌ మండిపడ్డారు. పాక్‌ సహకారం వల్లే కశ్మీర్‌ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.