ముమ్మరంగ వాహనాల తనిఖీలు.

ముమ్మరంగ వాహనాల తనిఖీలు.

కోటగిరి అక్టోబర్ 18 జనంసాక్షి:-రాష్ట్రంలో ఎన్నికల నగార మొగడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడిన పోతంగల్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ను బుధువారం రోజున బోధన్ ఎసిపి కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏసిపి కిరణ్ కుమార్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని.మద్యం,గంజాయి,50 వేల నగదు కన్న ఎక్కువ డబ్బులు ఎవరైనా తరలిస్తే వాటిని సీజ్ చేయాలని సూచించారు.తదనంతరం ఆయన పోతంగల్ గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.ఆయన వెంట స్థానిక ఎస్సై సందీప్,కానిస్టేబుల్స్ ఉన్నారు.