మువ్వనెల జెండా..మన అండ…

జెడ్పి కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..

 

-జాతీయ జెండా ఎగురవేసిన జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…

-జెడ్పి వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు..

గద్వాల రూరల్ ఆగస్టు 15 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా పరిషత్ కార్యాలయంలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాను జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఎగురవేశారు…ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ మువ్వనెల జెండా..మన అండ,సమర యోధుల పోరాటబలం, అమరవీరుల త్యాగఫలం బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం మన స్వాతంత్ర్య దినోత్సవం.
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకొని భరతజాతి విముక్తిపొందిన చారిత్రాత్మకమైన రోజు ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది.1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ సెలవు దినంగా ప్రకటించి అమలు చేసిందని పేర్కొన్నారు… ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్ పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు, ఎంపిపి ప్రతాప్ గౌడ్,జెడ్పి సిఈఓ విజయ నాయక్‌..డిప్యూటీ సిఈఓ ముసాయిదా బేగం…మల్లెందొడ్డి మద్దిలేటి, జైపాల్ రెడ్డి, బి.ఆర్.ఇమ్మానేయిల్,ధరూర్ రవి,టిఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య,గణేష్, కృష్ణ,ఆయా గ్రామాల ఎంపిటీసిలు,ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు..