ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండ్‌

ఇస్లామాబాద్‌: బేనజీర్‌ భుట్టో హత్య కేసులో నిందితుడైన పాకిస్థాన్‌ మాజీ ఆధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు 14 రోజుల జుడీషియల్‌ రిమాండును విధిస్తూ పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రావల్పిండిలో ఉన్న కోర్టుకు ముషారఫ్‌ మంగళవారం హాజరు కావాల్సి ఉంది. భద్రతా కారణల దృష్ట్యా ఆయనను హాజరు పరచలేకపోయిన్నట్లు ప్రాసిక్యూటర్‌ జుల్ఫీకర్‌ అలీ తెలిపారు.