మెడికల్ కళాశాల భూ నిర్వాసితులు కలెక్టర్ తో చర్చలకు హాజరు కావాలి.

అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు26(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల భూ నిర్వాసితులతో చర్చించేందుకు ఈనెల 27 శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ యస్. మోతిలాల్ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.సమావేశానికి కేవలం భూ నిర్వాసితులు  మాత్రమే హాజరు కావాలన్నారు.భూ నిర్వాసితులు సకాలంలో హాజరై తమ అభిప్రాయాలను కలెక్టర్ తో వెల్లడించాలని తెలిపారు.