మెమెన్కు ఉరిశిక్ష అమలు
1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన యాకూబ్ మెమెన్కు నాగ్పూర్ సెంట్రల్ జైలులో ఉదయం 6.43 నిమిషాలకు ఉరిశిక్షను అమలు చేశారు. 21 సంవత్సరాల జైలు శిక్ష తరువాత సుప్రీం కోర్టు తీర్పు మేరకు అధికారులు మెమెన్కు ఉరిశిక్షను అమలు చేశారు. మెమెన్ ఉరి సందర్భంగా నాగ్పూర్ లో 144 సెక్షన్ను విధించారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.