మెస్సీ వీరాభిమాని మృతదేహం లభ్యం

కేరళ: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో క్రోషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోర పరాజయం పాలైందని ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహం ఆదివారం ఓ చెరువులో లభించింది. కేరళలోని అరుమనూర్‌కి చెందిన దినూ అలెక్స్ అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టుకి, ఆ జట్టు కెప్టెన్ మెస్సీకి వీరాభిమాని. మెస్సీ ఎప్పటికైనా ప్రపంచకప్ సాధించాలనేది అతని కోరిక. అయితే క్రోషియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అర్జెంటీనా పేలవమైన ప్రదర్శన చేసింది. ఆ జట్టుతో 0-3 తేడాతో ఓడిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన అలెక్స్, తన గదిలో ఓ సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే రెండు రోజుల అనంతరం అలెక్స్ నివసించిన గ్రామం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లికల్ బ్రిడ్జీ సమీపంలోని మీనాచిల్ నదిలో అలెక్స్ మృతదేహం దొరికింది. అలెక్స్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతనికి మెస్సీ అంటే విపరీతమైన అభిమానమని, చివరిగా అతను కుటుంబంతో కలిసి అర్జెంటీనా, క్రోషియా మ్యాచ్ చూసినట్లు అతని తండ్రి తెలిపారు.