మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదాం

– డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి
కుల్కచర్ల,జూలై 7(జనం సాక్షి):
మొక్కలు నాటుదాం..పర్యావరణాన్ని కాపాడుదామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.గురువారం కుల్కచర్ల మండలంలోని చాపల గూడెం గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీళ్ళు పోశారు.ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాందాస్ నాయక్, స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ గండి లక్ష్మణ్, పీఏసీఎస్ డైరెక్టర్ కొండయ్య, తెరాస నాయకులు కనకం మొగులయ్య, రాజు నాయక్, రాములు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.