మోడీ పాలనపై రాహుల్ విమర్శలు

కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేరళ పర్యటనలో ఉన్న రాహుల్ త్రిసూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. భూ సేకరణ బిల్లు ద్వారా రైతులకు తల్లి లాంటి భూమిని లాక్కునేందుకు చేస్తున్న ప్రయత్నం మాదిరిగానే… కేరళలో మత్స్యకారులకు సముద్రంలో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు, పేదలను కష్టాల పాలు చేయటమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందని రాహుల్ విమర్శించారు.