మోడీ వీరాభిమాని కడప నుండి ఢిల్లీ వరకు పాదయాత్ర.

నెరడిగొండఆగస్టు4(జనంసాక్షి):
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప నుండి దేశ రాజధాని ఢిల్లీ వరకు వెళ్లి మోడీని జన్మదిన శుభాకాంక్షలు తెల్పుటకు నరసింహ అనే మోడీ వీరాభిమాని గత నెల17వ తేదీ నుండి ప్రారంభమైన పాదయాత్ర గురువారం నేరడిగోండ మండల కేంద్రానికి చేరుకుంది. ఆయనకు భారతీయ జనతా పార్టీ నేరడిగోండ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయనకు అల్పాహారం ఏర్పాటు చేశారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజెవైఎం మండల అధ్యక్షుడు ఓబిసి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.