మోదీకి ధన్యవాదాలు తెలిపిన జయలలిత…

చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు తమిళనాడు సీఎం జయలలిత ధన్యవాదాలు తెలిపారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తనకు అభినందనలు తెలిపినందుకు, మంచి జరగాలని కోరుకుంటూ సందేశాలు పంపినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలితకు ప్రధాని మోదీ ట్విటర్ లో అభినందలు తెలిపారు. జయకు అభినందనలు తెలిపిన జైట్లీ.. తమిళనాడుతో కేంద్రం సత్సంబంధాలు కోరుకుంటోందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు.. జయలలితకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.