మోదీని దాటేసిన ప్రియాంక చోప్రా

-ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్‌ ఫాలోవర్లు
ముంబయి, జులై5(జ‌నం సాక్షి) : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్‌లో ప్రియాంకను అభిమానించే వారి సంఖ్య ఎక్కువే. ఇక హాలీవుడ్‌కు వెళ్లాక ఆమె ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఐశ్వర్యరాయ్‌ తర్వాత అంతటి క్రేజ్‌ సంపాదించుకున్నది ఆమే. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్‌కు చేరింది.
ఈ సందర్భంగా అభిమానులకు ప్రియాంక ధన్యవాదాలు తెలిపారు. ’25 మిలియన్‌ స్టాం/-రగ్‌. ధన్యవాదాలు. విూరు నన్నెంతగా అభిమానిస్తున్నారో మిమ్మల్ని నేను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఫాలోవర్ల సంఖ్య విషయంలో ‘దేశీ గర్ల్‌’.. ప్రధాని నరేంద్ర మోదీనే దాటేశారు. మోదీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 13.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. బాలీవుడ్‌ దిగ్గజాలు అమితాబ్‌ బచ్చన్‌కు 9.5 మిలియన్‌, షారుక్‌ ఖాన్‌కు 13.3 మిలియన్‌, సల్మాన్‌ ఖాన్‌కు 17.3 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.ప్రియాంక ఫాలోవర్ల రికార్డును సమం చేయడానికి దీపిక అతి తక్కువ దూరంలోనే ఉన్నారు. ప్రస్తుతం దీపికకు ఇన్‌స్టాగ్రామ్‌లో 24.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’తో ప్రియాంక హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ సిరీస్‌తో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘బేవాచ్‌’ చిత్రంలో నటించారు. ప్రియాంక నటించిన తొలి హాలీవుడ్‌ చిత్రమిది. ప్రస్తుతం ఆమె ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్‌’, ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోపక్క బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా ‘భారత్‌’ సినిమాలో నటించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ న్యూయార్క్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం ప్రియాంక రూ.6 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.
————————————-