మోదీ గాలి దిల్లీ ఎన్నికల్లో తెలిసింది
వరంగల్ మార్చి 16(జనంసాక్షి):
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టేనని మంత్రి హరీశ్ రావు పట్టభద్రు లను అప్రమత్తం చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయాన్ని కాం క్షిస్తూ వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేం ద్ర మోడీ హవా ఏంటో ఢిల్లీ ఎన్నికల్లో తెలిసి పోయిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రాజేశ్వర్ రెడ్డి గెలుపు విషయంలో తమకె లాంటి అనుమానాలు లేవని, మెజారిటీ కోసమే ప్రయత్నిస్తున్నామని మంత్రి చెప్పారు.చంద్రబాబు మాటలు విని ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిన చరిత్ర నరేంద్ర మోడీదని మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. బీజేపీ అభ్యర్థి ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని ఆయన ప్రశ్నించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉద్యమంలో పాల్గొని అనేక కేసులు, జైలు జీవితం గడిపిన వ్యక్తి అని మంత్రి కొనియాడారు. ఉద్యమం చేసిన రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేయడమే సరైందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, వాటిని నెరవేరుస్తామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.