మోదీ మాట తప్పారు!

– తుఫాన్‌ బారిన పడిన రాష్టాన్రికి చిల్లిగవ్వ ఇవ్వలేదు

– రూ.23811.60 కోట్ల మేర నష్టం వాటిల్లింది

– పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట తప్పారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బుల్‌ బుల్‌’ తుపాను బారిన పడిన తమ రాష్టాన్రికి కేంద్రం చిల్లిగవ్వ కూడా విదిల్చలేదంటూ దుయ్యబట్టారు. రాష్టాన్రికి ఆర్థిక సాయం చేస్తామంటూ ట్విటర్లో ప్రధాని ప్రకటించారనీ, కానీ ఇప్పటి వరకు నిధుల విడుదల ఊసేలేదని ఆమె ఆరోపించారు. బుల్‌ బుల్‌ తుపాను తర్వాత ఓ కేంద్ర బృందం రాష్టాన్రికి వచ్చి సర్వే చేసిందని, అయినా ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆర్ధిక సాయం అందలేదని అన్నారు. రాష్టాన్రికి రూ.23811.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, రాష్టాన్రికి సాయం చేస్తామంటూ ప్రధాని మోదీ ట్విటర్లో ప్రకటించారని మమతా గుర్తుచేశారు. కానీ ఇంత వరకు నిధులు విడుదల చేయలేదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో బుల్‌ బుల్‌ తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మమత సమాధానం చెబుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ధిక శాఖ నుంచి రూ.1200 కోట్లు విడుదల చేసినట్టు మమత వెల్లడించారు.యుడు కోరారు.