మ్యూజిషియన్ మృతిపై సిబిఐ విచారణ
తిరువనంతపురం,డిసెంబర్10(జనంసాక్షి):కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్ బాలభాస్కర్ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్తోపాటు అతని రెండేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయారు. అయితే బాల భాస్కర్ది అనుమానాస్పద మృతిగా పేర్కొంటూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ ప్రభుత్వం బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది.