యాత్రికులను కాపాడేందుకు కృషి: షిండే

డెహ్రాడూన్‌ : వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఇప్పటికే ఉత్తరాఖండ్‌కు కొంత పరిహారాన్ని కేంద్రం నుంచి అందించినట్లు చెప్పారు. యాత్రికులను కాపాడేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.