యాదగిరి కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్‌

హైదరాబాద్‌: ‘గాలి’ బెయిల్‌ కుంభకోణంలో కస్టడీలో ఉన్న రౌడీషిటర్‌ యాదగిరిరావును కస్టడీకి ఆవ్వాలని కోరుతూ అవినీతి అవినీతి నిరోధకశాఖ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కోసం ఐదురోజుల పాటు కస్టడీకీ ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. గాలికి బెయిల్‌ మంజూరు చేయించడంతో గాలి పాత్ర కీలకమని తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ వ్యవహరంలో ముడుపులు సొమ్ముకు సంబంధించి ఇతర వివరాల్ని నిందితులని నుంచి తెలుసుకోవాల్సివుందని ఏసీబీ తన పిటీషన్‌ పేర్కొంది.