యువకుడి ఆత్మహత్యాయత్నం

యువకుడి ఆత్మహత్యాయత్నం

ధర్మసాగర్‌  పోలీసుస్టేషన్‌ సమీపంలో ఆదివారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నాకిని పాల్పడ్డాడు ధర్మసాగర్‌ పోలీసులు కధనం ప్రకారం ధర్మసాగర్‌ మండలం శాయిపేట గ్రామానికి చెందిన రాపోలు రోశయ్య (20) అనే ఆటోడ్రైవర్‌ బంజరుపల్లికి చెందిన వంగ ప్రవళిక(15) అనే యువతిని ప్రేమించాడు వీరిద్దరు కలిసి శనివారం ఇంట్లోంచి వెళ్లిపోయారు యువకుడి సోంత గ్రామం కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ కావడంతో అక్కడికి వెళ్లి ఉంటారని బాలిక తండ్రి జగదీష్‌ హుజురాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు హుజురాబాద్‌ పోలీసులు వీరిద్దరు ఆచూకీ తెలుసుకుని శనివారం రాత్రి ధర్మసాగర్‌ పోలీస్‌స్టేషన్‌కు  పంపించారు ధర్మసాగర్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చేసరికి రాత్రి 12 గంటలు దాటింది దీంతో పోలీసులు ప్రవళిను రోశయ్యలను ఎవరి ఇళ్లకు వారిని వెళ్లమని చెప్పి ఆదివారం ఉదయం రమ్మని చెప్పారు అయితే ఉదయం వాళ్లు పోలీసుస్టేషన్‌కు వచ్చేసరికి సీఐ శ్రీనివాస్‌ ధర్మపురంలో దొంగతనం జరిగిందని అక్కడకు వెళ్లారు ఇదే సమయంలో వచ్చిన రోశయ్య కొద్ది సేపు ఉండి బాత్‌రూత్‌కు వెళ్లి వస్తానని చెప్పి పోలీసుస్టేషన్‌ వెనుక ఉన్న జనరేటర్‌లో ఉన్న డీజిల్‌ తీసుకొని కిద్ది దూరం వెళ్లి ఆత్మహత్మకు యత్నించాడు ఇది గమనించిన పోలీసులు వెంటనే 108 అంబులెస్స్‌కు సమాచారమిచ్చారు అంబులెస్స్‌ వచ్చేలోపే అతను చాలావరకు కాలిపోగా వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు రోశయ్యపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రవళికను కిడ్నావ్‌ చేసిన కేసు నమోదైందని సీఐ తెలిపారు.