యువతులపై యాసిడ్‌ దాడి

న్యూఢీల్లీ : పాఠశాలనుంచి ఇంటికివెళ్లున్న నలుగురు అక్కాచెల్లెళ్లపై మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు యాసిడ్‌ చల్లిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన యవతి ఢీల్లీలో చికిత్స పొందుతున్నట్లు పొలీసులు బుధవారం తెలిపారు. అక్కాచెల్లెళ్లలో ముగ్గురు టీచర్లుగా పనిచేస్తున్నారు.అందరిలోనూ చిన్నదైన యువత ఈ యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు . కేసు దర్యాప్తుజరుగుతోంది.