యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం

బస్సు-ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 9మంది మృతి

లక్నో,నవంబర్‌26(జనం సాక్షి): ఉత్తర ప్రదేశ్‌లోని బండ జిల్లాలో సోమవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బసు-ట్రక్కు ఢీకొని 9 మంది మృతి చెందగా 15 మంది త్రీవంగా గాయపడ్డారు. యుపిఆర్‌టిసి అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులకు ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తెలిపారు. మృతులకు సంతాప తెలిపడంతో మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. బస్సు బండ నుంచి ఫతేపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమచారం. గాయపడిన వారికి 2.5 లక్షలు రూపాయలు ఇస్తామని సిఎం ప్రకటించారు.