యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎటా జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. 23 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.