యూపీలో రోడ్డుప్రమాదం: తల్లీబిడ్డా మృతి

లక్నో,ఫిబ్రవరి28 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బల్‌రాంపూర్‌ జిల్లాలోని గౌర ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ తల్లీ బిడ్డా దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పిర్‌ప్రా గ్రామ సవిూపాన శుక్రవారం రాత్రి ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మన్నాదేవి(28), ఆమె 8నెలల బిడ్డ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారి శ్రీచంద్‌ తెలిపారు. మన్నాదేవి భర్త తీవ్రంగా గాయపడ్డాడు.