యూపీ ఫలితాలే కీలకం :అమిత్‌షా

లక్నో, (జనంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫలితాలు సాధిస్తే కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని బీజేపీ యూపీ పర్యవేక్షకుడిగా నియమితులైన గుజరాత్‌ మంత్రి అమిషా అన్నారు. బీజేపీ యూపీ ఇన్‌ చార్జిగా ఆయన నేడు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తొలిసారిగా తాను యూపీకి వచ్చానని తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాడాలంటే 2014 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో పార్టీ మంచి ఫలితాలు సాధించాలన్నారు.