రంగలీల మైదానం సందర్శించిన డిసిపి ఎంఏ భారీ

రంగలీల మైదానం సందర్శించిన డిసిపి ఎంఏ భారీ

 

వరంగల్ ఈస్ట్ అక్టోబర్ 19(జనం సాక్షి)ఉరుసు రంగలీల మైదానంలో నిర్వహించే సద్దుల బతుకమ్మ దసరా వేడుకలను పురస్కరించుకొని గురువారం వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి ఎంఏ భారీ రంగలీల మైదానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా కరీమాబాద్ దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల గురించి బందోబస్తు ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై డిసిపి వివరించారు ఈ సందర్భంగా ఎంఏ భారీ మాట్లాడుతూ ఉత్సవాలకు ఎలాంటి అవాంతరాలు జరగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయించనున్నట్టు తెలిపారు ముఖ్యంగా ట్రాఫిక్కు నియంత్రణతో పాటు వివిఐపి పాసులు ట్రాఫిక్ పాయింట్స్ మొదలైన అంశాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపి బోనాల కిషన్ ,మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ సురేష్, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపురి సంజయ్ బాబు, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, కన్వీనర్ వడ్నాల నరేందర్, వంగరి కోటి, గోనె రాంప్రసాద్, పొగాకు సందీపు, ఒగిలిశెట్టి అనిల్, బత్తిని అఖిల్, రంజిత్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు