రంగోలి వేడుకలు నిర్వహించిన ఇంద్ర నగర్ అంగన్వాడీ సిబ్బంది

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 14 (జనం సాక్షి న్యూస్ ): 75 సంవత్సరాల స్వాతంత్ర్య పు వేడుకల్లో భాగంగా స్థానిక పట్టణం లో ఐదవ వార్డు ఇందిరానగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ వెంకటమ్మ ఆధ్వర్యంలో  కిశోర బాలికలు చిన్నారులు తల్లుల తో రకరకాల ముగ్గుల పోటీలు నిర్వహించారు. రకరకాల రంగవల్లికలు వేసి ఆనందంగా భారత స్వాతంత్రపు 75 వ వజ్రోత్స వేడుకలను ఇలా రంగురంగుల ముగ్గులతో అలరించారు. అక్షరాభ్యాస పిల్లలు, కిశోర బాలికలు, వార్డు ప్రజల ను ఉద్దేశించి అంగన్వాడి టీచర్ భారత స్వాతంత్ర వేడుకలు, భారత దేశం గొప్పదనాన్ని, జాతీయ భావాన్ని  ,స్వతంత్ర పోరాటం చేసిన మహనీయుల గురించి వివరించారు. ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతి మరియు కన్సోల్డేషన్ బహుమతులు అంగన్వాడి సిబ్బంది అందజేశారు.