*రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి

తహసిల్దార్ పాండు నాయక్*

వీపనగండ్ల ఆగస్టు 10 (జనంసాక్షి) నువ్వు దానం చేసే రక్తం జీవన్మరణ సమస్యకు పరిష్కారం చూపుతుంది అందుకే రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. విపనగండ్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్లు తహసిల్దార్ పాండు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ పాండు నాయక్ మాట్లాడుతూ రక్తదానం చేసి ఇతర ప్రాణాలను కాపాడాలని తాసిల్దార్ అన్నారు. అత్యవసర సమయంలో బ్లడ్ కావాలన్నా బ్లడ్ అవసరం ఉన్నవాళ్ళకు డొనేషన్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, ఎంపీడీవో కథలప్ప, తాసిల్దార్ పాండు నాయక్, ఎస్ఐ రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.