*రక్తదానం చేసిన కొడకండ్ల టి ఆర్ యస్ మండల యూత్ మరియు సోషల్ మీడియా వారియర్స్*

కొడకండ్ల, ఆగస్ట్07(జనం సాక్షి):
థలసేమియా వ్యాధిగ్రస్తులకు మరియు అత్యవసరంలో  ఉన్న వారికి రక్తం అందించుట కొరకు
వరంగల్ సీపీ తరుణ్ జోషి ఆదేశాల మేరకు మెగా రక్త దాన శిబిరాన్ని వర్ధన్నపేట డివిజన్ ఏసీపీ  శ్రీనివాస్ రావు  ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పాలకుర్తి లోని భషారత్ గార్డెన్ లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  పాలకుర్తి సిఐ చేరాలు, ఎస్ఐ కొమురెల్లి పిలుపుమేరకు టిఆర్ఎస్ పార్టీ యూత్  యూత్ అధ్యక్షుడు సతిష్ గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షుడు అశోక్, నాయకులు చెంచు రాజిరెడ్డి, అనపర్తి క్రాంతి, ధారవత్ నరేష్ నాయక్, ధారవత్ శ్రీను నాయక్,తాళ్ళ శోభన్,తీగల సందీప్ ,కుంచం హరీష్,బండారు సోమన్న, సోమారపు సతీష్,తండా ఉపేందర్,బాకి శ్యామ్, వడ్డేపల్లి ప్రభుదాస్, ధరావత్ రామ్,ఏడెల్లి రణదీర్,శంకర్,శివ, మరియు కొడకండ్ల మండలం నుండి 50 మంది యువత పాల్గొని రక్తదానం చేశారు.  ఏసీపీ,సీఐ చేరాలు, ఎస్సై కొమురెల్లి రక్తదాన శిబిరంలో కొడకండ్ల మండలం నుండి పాల్గొన్న యువతను అభినందించారు. మరియు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమంలో యువత ఎక్కువగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.