రాంమాధవ్కు మాతృవియోగం
న్యూఢిల్లీ,మే16(జనం సాక్షి): బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కు మాతృ వియోగం కలిగింది. ఢిల్లీలోని రాంమనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకిదేవి బుధవారం కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమెను ఇక్కడి లోహియా ఆస్పత్రిలో చేర్చారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. జానకిదేవి అంత్యక్రియలు రేపు గురువారం)హైదరాబాద్లో జరగనున్నాయి. రాంమాధవ్కు బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. ఆయనను పలువురు కలసి సంతాపం తెలిపారు.