రాజకీయం చేయొద్దు: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా దీనానగర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు లోక్‌సభలో డిమాండ్‌ చేశాయి. దీనికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందిస్తూ గురుదాస్‌పూర్‌లో కమాండో ఆపరేషన్‌ కొనసాగుతోందని, ఆపరేషన్‌ పూర్తయ్యాక పార్లమెంట్‌లో ప్రకటన చేస్తామని అన్నారు. ఇది దేశభద్రతకు సంబంధించిన అంశమైనందున ఎవరూ రాజకీయాలు చేయొద్దని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.