రాజగోపాల్ రెడ్డిని ప్రజలు విశ్వసించరు

జనంసాక్షి నవంబర్ 17 : కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రజల కోసం కాకుండా పదవుల కోసం పైసల కోసం రాజకీయ వ్యభిచారులుగా మారిన సంగతిని ప్రజలు గమనిస్తున్నారని మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కొనతం యాకుబ్ రెడ్డి అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే భిన్నంగా నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి విమర్శించడం సిగ్గుచేటు వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఎటువంటి నీచ రాజకీయాలు చేయడానికి అయిన కోవర్ట్ బ్రదర్స్ ముందుంటారని ఆయన ఆరోపించారు. వారు ఎన్ని ధర్నాలు చేసిన డ్రామాలు ఆడినా ప్రజల్లో విశ్వాసాన్ని ఉనికిని కోల్పోయారని ఆయన తెలిపారు ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, రైతు సమన్వయ కోఆర్డినేటర్ కొండా మల్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాంపాక నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి పర్రె బిక్షం, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్ ,దేవరపల్లి నర్సిరెడ్డి , కూరెల్ల దాస్ లు పాల్గొన్నారు.