రాజధాని నిర్మాణం మాటున..  భారీ భూకుంభకోణం


– టీడీపీ నేతలు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు
– రాజధాని చందాలు, ఇటుకలు ఏమయ్యాయి..?
– వైసీపీ ఎంపీ నందిగాం సురేష్‌
న్యూఢిల్లీ, నవంబర్‌27 (జనంసాక్షి)  : ఏపీ రాజధాని మాటున టీడీపీ భారీ భూ కుంభకోణం ఉందని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్‌ ఆరోపించారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎక్కువ కవిూషన్లు తీసుకోవచ్చని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని, అలాంటి అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరేడ్‌ చేస్తారని ప్రశ్నించారు. పర్మినెంట్‌ అంటే లెక్కలు చూపించాల్సి వస్తుందని తమ్ముళ్ల భయంతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారన్నారు. రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్‌లు కట్టారని, ఒకటి హైకోర్టు, తాత్కాలిక సచివాలయమన్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు కారుతుందని, పెంకులు లేచిపోతున్నాయన్నారు. చంద్రబాబు రాజధానిని సర్వనాశనం చేశారన్నారు. భూములు కబ్జా చేశారని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులను మోసం చేశారని ధ్వజమెత్తారు. శంకుస్థాపనకు లక్షల ఇటుకలు ఇచ్చారని, ఆ ఇటుకలు ఏమయ్యాయో తెలియదన్నారు. విద్యార్థులతో రూ.10 చొప్పున చందాలు వసూలు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడేమో రూ.9వేల కోట్లు రాజధానికి ఖర్చు చేశామని చెబుతున్నారు. ఆ డబ్బులకు మాత్రం లెక్క చెప్పడం లేదన్నారు. జగన్‌ విషయంలో ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఏవిూ చేయలేరన్నారు. వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు మాని, ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలని సూచించారు. దళితులకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో 1400 గజాలు ఇచ్చారని, విూ బినావిూల భూములు కొనుగోలు చేసిన తరువాత ఫూలింగ్‌ విధానం నుంచి తప్పించారన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుందని దుయ్యబట్టారు. బోండా ఉమా అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆయన అమరావతిలో ఏవిూ చూడలేదని, చంద్రబాబుకు బ్యాండ్‌ మేళం ఊదాలి కాబట్టి ఉమా మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కచ్చితంగా చేపడుతుందని, అయితే
చంద్రబాబు మాదిరిగా వేల కోట్లు వృథా చేయమని అన్నారు.