*రాజరాజేశ్వరి దేవి గా దర్శనమిచ్చిన అమ్మవారు*

పెబ్బేరు సెప్టెంబర్ 28 ( జనంసాక్షి ):  పెబ్బేరు వాసవి కన్యకపరమేశ్వరి ఆలయంలో మూడవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి గా,  పట్టణంలో చిన్న చౌడేశ్వరి ఆలయంలో శ్రీ సాయి గణేష్ యూత్ అద్వర్యం నెలకొల్పిన అమ్మవారు మూడవ రోజు గాయత్రి దేవి,సూగూర్ గ్రామంలో
 శ్రీ శ్రీ శ్రీ రామాలయం నందు దేవీశరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మ వారి విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యుల అధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారు మూడవ రోజు గాయత్రి దేవిగా దర్శనమిచారు.తోమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం కల్పించనున్నారని నిర్వహుకులు తెలిపారు.బుధవారం సాయంత్ర సమయంలో మహిళలచే సాముహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు.
Attachments area