రాజస్థాన్‌లో 165కు చేరిన స్వైన్‌ఫ్లొ మృతుల సంఖ్య

జైపూర్‌,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): రాజస్థాన్‌లో స్వైన్‌ఫ్లొతో మరణించేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా 12 మంది మృతి చెందడంతో మృతుల సంఖ్య 165కు చేరింది. నాగౌర్‌లో నలుగురు, జైపూర్‌, జోధ్‌పూర్‌లో ఇద్దరు చొప్పున, సికర్‌, బికనీర్‌లో ఒక్కొక్కరు మృతిచెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 2569 మందికి హెచ్‌1ఎన్‌1 వైరస్‌ సోకినట్టు నిర్దారించగా ఇప్పటివరకు 165 మంది మృతిచెందారు. దీంతో ఆస్పత్రుల్లో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వైద్య సదుపాయాలు పెంచారు. అయినా వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. దీంతో మరింతగా వ్యాధి నివారణ చర్యలను చేపట్టారు.