రాజాపూర్ గ్రామంలో సామూహిక జాతీయ గీతాలాపన లో పాల్గొన్న ప్రజలు విద్యార్థులు ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్.లు సర్పంచు

కోడేరు (జనం సాక్షి)  ఆగస్టు 16 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ గ్రామ ప్రజలు యువకులు ప్రయాణంలో ఉన్న వాహనదారులు తదితరులు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం కంటే ముందు విద్యార్థులచే జాతీయ నాయకుల ను స్మరించుకుంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి రాజాపూర్ గ్రామ రచకట్ట బస్టాండు దగ్గర సామూహికంగా జాతీయ గీతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దేశ గౌని లీలావతి మధు గౌడ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ నరసింహ, గ్రామంలో అంగన్వాడి టీచర్స్ అంజనమ్మ,అరుణ, సౌజన్య, షఫీదాబేగం తదితరులు పాల్గొన్నారు.