రాజుపేట లో ఇంటింటి ప్రచారం చేసిన మాధురి

కూసుమంచి నవంబర్ 17 ( జనం సాక్షి ) : పాలేరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి పొంగులేటి మాధురి రాజుపేట లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వివరాల్లోకి వెళితే తాజా మాజీ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి స్వగ్రామమైన రాజుపేట లో మండల కాంగ్రెస్ నాయకులు రేల వెంకటరెడ్డి ఆయన సతీమణి రేలా సునీత మాధురి వెంట గడపగడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు మొత్తం కూడా కేసీఆర్ ఇంటికే చేరాయని అందుకే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆమె ప్రజలకు వివరిస్తూ తన పతి అయిన శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షేక్ మీరా సాబ్, గ్రామ కాంగ్రెస్ మహిళలు, పాల్గొన్నారు