రాములోరి కళ్యాణ బ్రహ్మోత్సవాల ముహూర్తం ఖరారు

భద్రాద్రి: సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముహుర్తం ఖరారైంది. భద్రాద్రిలోని వైదిక కమిటీ ఈ ముహూర్తాన్ని ఖరారు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్ 11 వరకు తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగునున్నాయి. అనంతరం ఏప్రిల్ 5న సీతారాములవారి కళ్యాణం నిర్వహించనున్నట్టు వైదిక కమిటీ తెలిపింది. ఏప్రిల్ 6న రాములవారి మహాపట్టాభిషేకానికి ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.