రాయికల్ మండలంలో బిజెపి అభ్యర్థి బోగ శ్రావణి ఇంటింటా ప్రచారం.

రాయికల్, అక్టోబర్ 27 (జనంసాక్షి)మండలంలోని కైరిగూడెం గ్రామంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి భోగ శ్రావణి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అన్నవేని వేణు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,ఎంపిటిసి ఆకుల మహేష్, మండల కార్యదర్శిలు నర్సయ్య, గంగారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, ఉపాధ్యక్షులు కోల శంకర్, తదితరులు పాల్గొన్నారు.