రాళ్లదాడితో ఆర్మీ స్థయిర్యాన్ని దెబ్బతీయలేరు

భవిష్యత్‌ను దెబ్బతీసుకోవద్దు
కాశ్మీరీ యువతకు ఆర్మీ చీఫ్‌ హెచ్చరిక
న్యూఢిల్లీ,మే10(జ‌నం సాక్షి): కశ్మీరీ యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని
ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ సందేశమిచ్చారు.  పోరాటాలు, ఉద్యమాలతో తమ భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకోవద్దని అన్నారు. యువత తుపాకులు చేతబట్టడంపై ఆందోళన వ్యక్తంచేశారు. కశ్మీర్‌కు స్వాతంత్యం/-ర ఎప్పటికీ సాధ్యం కాదని వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంది.. విూరిలా ఆర్మీతో పోరాడటం సరికాదు అని రావత్‌ కశ్మీర్‌ యువతకు పిలుపునిచ్చారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిపిన్‌ రావత్‌ మాట్లాడుతూ.. కశ్మీరీ యువత ఆగ్రహంతో ఉన్న విషయం తనకూ తెలుసని, అంతమాత్రాన
భద్రతా బలగాలపై రాళ్లదాడి సరికాదు అని ఆయన అన్నారు. నేను కశ్మీర్‌ యువతకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. ఆజాదీ సాధ్యం కాదు. అది ఎప్పటికీ రాదు. దానికోసం అనవసరంగా పోరాటాలు చేయకండి. విూరు ఆయుధాలను ఎందుకు పట్టుకుంటున్నారు? ఆజాదీ కోరుకునే వాళ్లతో మేమెప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ఆ ఆజాదీ విూకు ఎప్పటికీ రాదు అని రావత్‌ స్పష్టంచేశారు. ఆజాదీ కోసం యువతతో ఆయుధాలు పట్టించడమే ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. ఈ పోరాటంలో ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారన్నది నాకు అనవసరం. ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికే కొత్తగా రిక్రూట్‌ చేసుకుంటూనే ఉన్నారు. నేను ఒక్కటే చెప్పదలచుకున్నా. దీనివల్ల సాధించేదేవిూ లేదు. విూరు ఆర్మీతో పోరాడటం సరికాదు అని రావత్‌ చెప్పారు. కశ్మీరీ యువత చనిపోవడం తనకు కూడా బాధ కలిగిస్తున్నదని ఆయన అన్నారు. దీనిని మేమేవిూ ఆస్వాదించడం లేదు. కానీ విూరు మాతో ్గ/ట్‌ చేయాలనుకుంటే మేము కూడా పూర్తి బలగంతో పోరాడుతాం. అయినా పాకిస్థాన్‌, సిరియాల్లోలాగా ఇక్కడ భద్రతా బలగాలు మరీ అంత కఠినంగా ఏవిూ లేవు. ఇలాంటి పరిస్థితులు వస్తే ఆ దేశాల్లో యుద్ధ ట్యాంకులు, వైమానిక దళాలనూ వాడుతారు. మమ్మల్ని ఎంతగా రెచ్చగొడుతున్నా మా బలగాలు మాత్రం పౌరులకు ఎలాంటి హాని కలుగకుండా చూస్తున్నారు అని రావత్‌ చెప్పారు.