రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
హైదరాబాద్ : రాష్ట్ర హోంమంత్రి అధ్యక్షతన రాష్ట్ర భద్రతా కమిషన్ను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సభ్యులుగా ఉంటారు. భద్రతా కమిషన్ కన్వీనర్, కార్యదర్శిగా డీజీపీ వ్యవహరించనున్నారు.