*రాష్ట్ర విఆర్ఎ జెఎసి పిలుపుమేరకు జిల్లా కలక్టరేట్ ముందు 48గంటల వంటా వార్పు*

నాగర్ కర్నూల్ రూరల్ ఆగస్టు 25(జనంసాక్షి)
రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు వీఆర్ఏ నిరవధిక సమ్మెలో భాగంగా 32వ రోజు 48గంటల వంట వార్పు కార్యక్రమంలో నిన్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి నేత ఏళ్లేని సుధాకర్ రావు మరియు దిలీపాచారి,రాష్ట్ర విఆర్ఏ జేఏసీ కో కన్వీనర్ మాధవ నాయుడు వీఆర్ఏ రాష్ట్ర నాయకులు రాజుగారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ,CITU జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు,ఐద్వా జిల్లా అధ్యక్షురాలు గీత,బీఎస్పీ నేత కొత్తపల్లి కుమార్,జన సమితి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి,వీఆర్ఏల మహా ధర్నా వంటవార్పు కార్యక్రమంలో మద్దతు ఇచ్చి సంఘీభావం తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా జేఏసీ చైర్మన్ ఆర్.విజయ్ కోచైర్మన్ ఏశంకర్ సెక్రటరీ జనరల్ కే.అంజనేయులు కో కన్వీనర్లు నాగరాజు,భాస్కర్,బంగారి,నిరంజన్,ప్రసన్న,శోభారాణి,రాధ,ఖాజాబాను మరియు 20మండలాల జేఏసీ చైర్మన్లు కో చైర్మన్లు సెక్రెటరీ జనరల్ కన్వీనర్లు మరియు అందరు వీఆర్ఏలు పాల్గొనడం జరిగినది.