రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందిన ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే..

గద్వాల రూరల్ సెప్టెంబరు 16 (జనంసాక్షి):-    హైదరాబాద్ లో ఈనెల 5వ తేదీ నాడు  రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న ఎల్లస్వామి, శ్రీనివాసులు లను శుక్రవారం  గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల శాసనసభ్యులు శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉపాధ్యాయులను పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు..ఎమ్మెల్యే మాట్లాడుతూ గద్వాల నియోజవర్గానికి చెందిన ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావడం చాలా సంతోషకరమైన విషయం ఇలాగే భవిష్యత్తులో జాతీయస్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావాలని  ఈ ప్రాంతంలోని విద్యార్థిని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఇలాంటి పురస్కారాలు మరెన్నో అందుకోవాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకోవడం జరుగుతుందని తెలిపారు..భవిష్యత్తులో గద్వాల ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ,  ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,   ఎంపీపీలు ప్రతాప్ గౌడ్ విజయ్, రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్ పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ  సుదర్శన్ రెడ్డి, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, రాములు,  నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.